Monday, 18 May 2026

Life History of Sri Patnam Subramanya Iyer - జీవితచరిత్ర - పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్

  • ఇతడు క్రీ.శ. 1845 - 1902 కాలమునాటివాడు. అష్టసహస్ర బ్రాహ్మణుడు. ఆంధ్రతమిళభాషలలోను, సంగీతములోను గొప్ప పండితుడు.
  • మానంబుచావడి వెంకటసుబ్బయ్యగారి శిష్యుడు.
  • ఈయన గాత్రము మొదట అతికఠినముగా ఉండుటచే విపరీతమైన సాధన చేసి, తన గాత్రమును మాధుర్యమైనదిగా చేసుకొనగలిగిన సంకల్పసిద్ధుడు.
  • ఇతను త్యాగరాజ రచనలను అనుసరించి, “వేంకటేశ” ముద్రతో అనేక కృతులను, వర్ణములను, తిల్లానాలను, జావళీలను రచించిన సమర్ధుడు.
  • బేగడ రాగాలాపనలో ఈయనకుగల ప్రత్యేక నైపుణ్యమునకుగాను “బేగడ సుబ్రహ్మణ్య అయ్యర్” అని పిలువబడును.
  • అష్టోత్తర శత తాళములలో ఒకటైన 128 అక్షరకాలములుగల “సింహనందిని” తాళములో ఒక గొప్ప పల్లవి రచించి అత్యద్భుతంగా గానముచేసి, సభాసదులను ఆనందపరవశులుగా చేయగల ఏకైక సంగీతవిద్వాంసుడు.
  • ఇతడు మొదట తిరువత్తియూర్ లోను, తదుపరి చెన్నపట్టణంలోను నివసించుటచే పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ అని కూడా పిలువబడెను.
  • ఇతని రచనలకుగానీ, గానమునకుగానీ, రాగభావమే ప్రత్యేకత అగును.
  • ఈయన రచనలలో
  • “ఇంతకంటె” (కానడ),
  • “రఘువంశసుధాంబుధిచంద్రశ్రీ” (కదనకుతూహలం),
  • “మనసున నెర నమ్మితిని” (బేగడ),
  • “నిన్నుజూసి ధన్యుడనైతి” (సౌరాష్ట్ర)
  • వంటి కృతులు మిగుల ప్రసిద్ధములు.
  • శ్రీ రామ్నాడ్ శ్రీనివాస అయ్యంగార్ ఈయనకు శిష్యుడు.

No comments:

Post a Comment