Monday, 18 May 2026

Life History of Sri Tiruvotriyoor Thyagaiyer - జీవితచరిత్ర - తిరువత్తియూర్ త్యాగయ్యర్

  • ఇతడు 18-19 శతాబ్దాలకు చెందినవాడు.త్యాగరాజుకు ముఖ్యశిష్యుడు. తమిళబ్రాహ్మణుడు.
  • మద్రాసులోని తిరువత్తియూర్ నందు జన్మించుటచే “తిరువత్తియూర్ త్యాగయ్య” అని పిలువబడును.
  • ఇతడు ఘనరాగపంచకము మొదలైన 108 రాగములలో అతిభక్తిపూరితమైన కీర్తనలు రాసి, “సంకీర్తన రత్నావళి” అను గ్రంథమును రచించిన ప్రతిభావంతుడు. ఈ గ్రంథమును ఇతడు వేణుగోపాలస్వామికి అంకితమిచ్చిరి.
  • శ్రీత్యాగరాజుపై భక్తితో ఖరహరప్రియ రాగములో “త్యాగరాజ సద్గురుని తలతును ప్రేమతో” అను కీర్తనను రచించిరి.
  • కాంభోజిరాగములోని “సరసిజనాభ” అను అటతాళ వర్ణములో ముక్తాయిస్వరము 3 ఆవృత్తములలో ఉన్నవని విద్వాంసులు ఆక్షేపింతురని తలచి, దానిని పూర్తిచేయుటకు దక్షిణదేశమంతటా అనేకమంది ప్రయత్నించగా, చివరకు ఈయనయే దానిని పూర్తిచేసి, స్వరసింహుడని బిరుదుపొంది, “స్వరసింహ త్యాగయ్యర్” అని పిలువబడిరి.
  • నెల్లూరు రాఘవరాజుగారు, గుంటూరు వాస్తవ్యులైన శంకరయ్యశాస్త్రిగారు ఈయన శిష్యులు.
  • 1900 సంవత్సరంలో తమ తండ్రిగారైన కుప్పయ్యర్ గారి రచనలన్నింటిని చేర్చి, “పల్లవి స్వరకల్పవల్లి” అను పేరిట అచ్చొత్తించినారు. ఇది సంగీత ప్రపంచమునకు అఖండమైన సేవ.
  • వీరు తమ రచనలను సంకీర్తన రత్నావళిలో ముద్రించియున్నారు. వీరి ముద్ర “గోపాలదేవ” అనునది.

No comments:

Post a Comment